ఉద్ధానం సమస్యలపై స్పందించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ నిరాహార దీక్షకు దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళంలోని టెక్కలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్థుల సమస్యను తొలగించడానికి ప్రభుత్వం చేపడుతోన్న చర్యలపై పవన్ కల్యాణ్కు అవగాహన లేదని అన్నారు. గతంలో పవన్ కల్యాణ్ చేసిన సూచనలతో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై కూడా పవన్తో పాటు జగన్ మోదీని విమర్శించడంకుండా సొంత ప్రయోజనాలకోసమే పాకులాడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
కాగా, తిరుమల తిరుమతి దేవస్థాన మాజీ ప్రధానాచర్చకుడు రమణ దీక్షితులు చేస్తోన్న సంచలన ఆరోపణలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు టీటీడీలో జరుగుతోన్న సంఘటనలపై వేంకటేశ్వర స్వామే తీర్పు ఇస్తారని అన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 08:18PM