సూర్యాపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా గులాబీ జెండా సత్తా చాటుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఎరుకల భవన్ నిర్మాణానికి మంత్రి జగదీష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సైకిల్ రెండు చక్రాలు ఊడిపోయాయని..ఆంధ్రాలో మరొక చక్రం ఊడిపోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అంశంలో తెలంగాణను దేశం మొత్తం అనుసరిస్తోందన్నారు.
హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ నిర్మాణానికి భూమిపూజ చేసిన నిజాం రాజు కూడా ఏనాడూ చంద్రబాబు మాదిరిగా నగరాన్ని నిర్మించానని గొప్పగా చెప్పుకోలేదని పేర్కొన్నారు. నగరాన్ని నిర్మించడం ఏ ఒక్కరి చేతిలోనో ఉండదని..శతాబ్ధాలుగా అందరి కృషి వల్ల సాధ్యం అవుతుందని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 08:31PM