హైదరాబాద్: రైతు బీమా పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పథకంపై ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఆగస్టు 15న రైతులకు జీవిత బీమా పథకం ప్రారంభం కానున్నదన్నారు. దీనికోసం రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్న సీఎం... ఎల్ఐసీతో ఒప్పందం ద్వారా రైతు బీమా పథకం అమలు చేస్తామన్నారు. రైతు ఏకారణంతో మరణించినా బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు.
రైతు బీమాకు సంబంధించి మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. సాధారణ మరణమైనప్పటికీ నామినీకి 10 రోజుల్లోగా రూ. 5 లక్షల బీమా చెల్లిస్తామన్నారు. 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల లోపు రైతులకు బీమా వర్తిస్తుందన్నారు. ఎల్ఐసీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆకాంక్షించారు. దేశ చరిత్రలో రైతులకు బీమా సరికొత్త రికార్డు అని ఎల్ఐసీ అధికారులు పేర్కొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 08:53PM