ఢిల్లీ: కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి(సిబిఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఇటీవల సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఓ పరీక్షను తిరిగి నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఎలాంటి ఆలస్యం లేకుండా మార్చి 26న అంటే శనివారం విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. షbరవతీవరబశ్ర్ీర.అఱష.ఱఅ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ ఏడాది జరిగిన సిబిఎస్ఈ పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ విచారణ చేపట్టింది. 12వ తరగతి ఎకనామిక్స్ ప్రశ్నాపత్రం లీకైనట్లు నిర్ధారణకు రావడంతో ఏప్రిల్ 25న ఆ పరీక్షను మళ్లీ నిర్వహించారు. 10వ తరగతి గణిత ప్రశ్నాపత్రం కూడా లీకైనట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ.. అందులో నిజం లేదని తేలింది. దీంతో ఆ పరీక్షను తిరిగి నిర్వహించలేదు
Mon Jan 19, 2015 06:51 pm