మెహిదీపట్నం: ఓ గృహిణిని శాడిస్టు భర్త డబ్బుల కోసం చిత్రహింసలు పెట్టడమే కాకుండా... కాళ్లు, చేతులు కట్టేసి ఐరన్ బాక్సుతో శరీరంపై కాల్చాడు. ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి అంజయ్యనగర్కు చెందిన ప్రశాంత్ కుమార్కు షేక్పేటకు చెందిన జ్ఞాన పుష్ప జ్యోతితో 2012 మేలో వివాహం జరిగింది. ప్రస్తుతం జ్ఞాన పుష్పజ్యోతి అఫ్జల్గంజ్ వద్ద ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది.
వెబ్ డిజైనింగ్గా పని చేస్తున్నానని చెప్పి వివాహం చేసుకున్న ప్రశాంత్కుమార్ జులాయిగా తిరుగుతూ భార్య సంపాదనపై జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం వీరు నానల్నగర్కు వచ్చి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. డిసెంబర్లో పుష్పజ్యోతి తల్లి రిటైర్ అయింది. అప్పటి నుంచి భర్త ప్రశాంత్కుమార్, అత్త, మామ, ఇతర కుటుంబ సభ్యులు డబ్బులు, బంగారం తేవాలంటూ కొన్ని రోజులుగా జ్యోతిని తీవ్రంగా వేధిస్తున్నారు. ఇతని వేధింపులు గురువారం పరాకాష్టకు చేరాయి. గురువారం ఉదయం జ్యోతిని ఇంట్లో కాళ్లు చేతులు కట్టేసి ఐరన్ బాక్సుతో చేతులకు, మెడపై కాల్చాడు. సాయంత్రం ఉద్యోగానికి జ్యోతి వెళాల్సి ఉండగా.. ఆమె కాళ్లు చేతులు విప్పారు. ఇదే అదనుగా భావించిన ఆమె వారి నుంచి తప్పించుకొని షేక్పేటలోని తన తల్లిగారింటికి వెళ్లింది. శుక్రవారం సోదరుడితో కలిసి లంగర్హౌస్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 26,2018 06:36AM