న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనీల్ స్వరూప్ శుక్రవారం ట్విటర్ ద్వారా ఈ విషయం ప్రకటించారు. ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి ఫలితాలను విద్యార్థులు గూగుల్ సెర్చి పేజీలో కూడా చూసుకోవచ్చు. గూగుల్ సెర్చి పేజీలో ాసీబీఎస్ఈ రిజల్ట్స్్ణ లేదా ాసీబీఎస్ఈ క్లాస్ 10 రిజల్ట్స్్ణ లేదా ాసీబీఎస్ఈ క్లాస్ 12 రిజల్ట్స్్ణ అని టైప్ చేసి హాల్టికెట్ నెంబరు కొడితే ఫలితాలు కనిపిస్తాయి. ఫలితాలు, పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా అందించేందుకు గూగుల్ సీబీఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ షషష.షbరవ.అఱష.ఱఅ లోనూ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 12వ తరగతి పరీక్షలకు 11.86 లక్షలమంది, తెలంగాణ నుంచి 30 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm