బెంగళూరు: శాసనసభలో బలపరీక్ష నెగ్గిన ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి శనివారం ఢిల్లీకి బయల్దేరి వెడుతున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇంతవరకు లభించకపోవడంతో ఆయనతో భేటీ అనుమానాస్పదంగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కుమారస్వామి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలను కలవనున్నారు. వీరిలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ తదితరులు ఉంటారని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ తెలిసింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్రమంత్రులతోనూ కుమారస్వామి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 26,2018 07:20AM