హైదరాబాద్: నగరంలో పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా.. మందు బాబుల్లో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా హైదరాబాద్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మందుబాబులు వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 113 మందిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో 82 కార్లు, 31 బైక్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm