హైదరాబాద్: జూన్ 8వ తేదీన మృగశిరకార్తెను పురస్కరించుకుని ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే చేపమందు పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శనివారం పరిశీలించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్కెజోషితో కలసి ఎగ్జిబిషన్ గ్రౌండ్ను సందర్శిస్తారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమావేశంలో చేపమందు కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తారు. చేపమందు కోసం రాష్ట్రం నుంచేకాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిఏటా వస్తుంటారు. ప్రభుత్వపరంగా ప్రతిఏటా రెవెన్యూ, పోలీస్, వాటర్వర్క్స్, జీహెచ్ ఎంసీ, హెల్త్, ఆర్ అండ్ బి. ట్రాఫిక్ పోలీస్, అగ్నిమాపకశాఖ తదితర శాఖల సమన్వయంతో అన్నిరకాల ఏర్పాట్లు చేస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm