హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జోన్లు, మల్టీ జోన్లు, రైతులకు జీవిత బీమా తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. గత ఏడాది జూన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తూ తీర్మానించారు. అయితే గతంలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించడంతో పాటు కొత్తగా ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్ర అవతరణ దినం జూన్ 2న సీఎం కేసీఆర్ చేయనున్న ప్రకటనలపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm