బెంగళూరు: ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య, కుమార్తెను హతమార్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రెండు రోజుల కిందటే ఇద్దరినీ చంపేసిన ఆయన గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మైసూరులోని విజయనగరలో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యల వెనక ఉన్న ఉద్దేశం తెలియరాలేదని, నిందితుడు కోలుకున్నాక వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు. మృతులను సవిత (39), సించన (10)గా గుర్తించారు. సవిత కూడా నిందితుడు ప్రజ్వల్ పనిచేస్తున్న కంపెనీలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు చెప్పారు.
రెండు రోజులుగా నిందితుడు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం నిందితుడి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. గొంతు కోసుకుని రక్తపుమడుగులో కొన ఊపిరితో ఉన్న ప్రజ్వల్, సవిత, సించన మృతదేహాలు కనిపించాయి. ప్రాణంతో ఉన్న ప్రజ్వల్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రజ్వల్ ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, అతడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 26,2018 08:13AM