తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ నిన్న కొనసాగుతున్నది. ప్రత్యేక దర్శనం (రూ.300) వారికి 02 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు 26 గంటల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చు. శ్రీవారి నడక మార్గమున అర్థరాత్రి 12:00 గంటల నుండి అలిపిరి 14, శ్రీవారిమెట్టు 6 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును. మొత్తం 20 వేల టోకెన్లు పూర్తయిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులు 20 వేల మందిని ఉదయం 08 గంటల తరువాత.. వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న 73,727 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది. నిన్న 54,490 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm