అమరావతి: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణానదీలో చేపల వేటకు వెళ్లిన తల్లీకూతుళ్లు బోటు ప్రమాదంలో మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి సమయంలో సైదారాజ్ అతని భార్య మాధవి, కూతురు కావ్య వేటకు వెళ్లిన పడవ ఇసుక రీచ్ ల మధ్యలో ఉన్న డ్రెజ్జర్ ను ఢీకొట్టి మునిగిపోయింది. సైరారాజు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే అతని భార్య మాధవి, కూతురు కావ్య గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు,రెస్క్యూ టీం మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm