కడప: కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం తాను చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలపవద్దంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. ఇందు కోసం సోమువీర్రాజు బృందం జిల్లాలో పర్యటించి అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నారన్నారు. కడప జిల్లావాసిగా జగన్ ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్క మాట మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ మూడు రోజులుగా ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఎంపీ దీక్షకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm