హైదరాబాద్ : తెలంగాణ పీసీసీలో మార్పులపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టి సారించారు. ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను నియమిస్తారని తెలుస్తోంది. ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ కు 40 అసెంబ్లీ స్థానాల బాధ్యతలు అప్పచెప్పనున్నారని సమాచారం. సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్కను నియమించడం..ఇతర రాష్ట్ర మాజీ సీఎంకు పార్టీ ఇన్ ఛార్జీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వీహెచ్ కు ప్రచార కమిటీ బాధ్యతలు ఇవ్వాలని ఉత్తమ్ ఒత్తిడి చేస్తున్నట్లు వినికిడి. రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm