అమరావతి: ఎపిలోని కృష్ణా జిల్లా చాట్రాయిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య అందరి ముందు చెప్పుతో కొట్టిందని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితం కిషోర్, శ్యామలకు పెద్దలు వివాహం జరిపించారు. అయితే, పెళ్లయిన వారం రోజులకే దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఏడాదిగా దంపతుల మధ్య తగాద కొనసాగుతోంది. ఇటీవల దంపతులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సమయంలో భార్య శ్యామల పోలీసుల ముందే భర్తను చెప్పుతో కొట్టింది. దాంతో మనస్తాపం చెందిన కిషోర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి మృతదేహంతో బంధువులు చాట్రాయి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు కిషోర్కు సంబంధించిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm