నంబూరు: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో వేంకటేశ్వరస్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత.. పైగా ఇరు పార్టీల బంధం వీగిపోయిన తర్వాత తొలిసారి వీరిద్దరూ ఎదురుపడటంతో ఏం మాట్లాడుకుంటారన్న ఆసక్తి మీడియాతో పాటు, ప్రజల్లో కూడా నెలకొంది. అయితే చంద్రబాబు, పవన్ మాత్రం పలకరించుకోకపోవడం కొసమెరుపు. ఆలయంలో పక్కపక్కనే నిల్చున్నారు. కానీ ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. భక్తులను పలకరిస్తున్న సమయంలో కూడా చంద్రబాబుకు పవన్ తారసపడ్డారు. అయినప్పటికీ ఇద్దరూ పట్టించుకోకుండా.. పలకరించుకోకుండానే వెళ్లిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm