విజయవాడ: విజయవాడలోని జక్కంపూడి కాలనీలో నిన్న వెలుగుచూసిన వ్యభిచార ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై విచారణకు జాయింట్ కమిషనర్ కాంతిరాణాను విచారణాధికారిగా నియమించారు. దీంతో ఆయన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు శోభారాణితో పాటు ఆమె భర్త, ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm