హైదరాబాద్ : కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్ దీక్షపై అదే పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీక్షలతో ఉక్కు పరిశ్రమ రాదని తేగేసి చెప్పారు. దీక్షలతో ఉక్కు.. తుక్కు ఏదీ రాదని జేసీ సీఎం రమేష్ ని ఎద్దేవాచేశారు. పాలకులకు పగ, ప్రతీకారం ఉండకూడదని హితవు పలికారు. మూడేళ్ల కిందటే సీఎం చంద్రబాబుకు మోదీ ఏమీ చేయరని చెప్పానని అయితే అప్పుడు ఆయన పట్టించుకొలేదని ,ఇప్పడు చంద్రబాబుకు పరిస్థితి అర్థమైందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm