హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్భవన్లో జరిగిన ఈ సమావేశానికి పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ సహా 9 పార్టీల నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన అమల్లోకి వచ్చి శుక్రవారంతో మూడు రోజులైన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిపై అంచనా వేసేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ గవర్నర్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీడీపీ నుంచి మాజీ సీఎం మెహబూబా మఫ్తీ, కాంగ్రెస్ నుంచి గులాం అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ నుంచి సత్ శర్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm