వడోదర: లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదవుతున్న 14ఏళ్ల కుర్రాడి మృతదేహం టాయిలెట్లో రక్తపు మడుగులో పడి ఉంది. బాలుడి శరీరంపై పదునైన కత్తితో పొడిచిన గాయాలున్నాయి. ఈరోజు మధ్యాహ్నం రక్తపుమడుగులో ఉన్న అతడి మృతదేహాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. మృతదేహం వద్ద రక్తం అంటి ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm