హైదరాబాద్: జనసేన పార్టీ పాలన వ్యవహారాల కోసం నూతన కార్యాలయం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలోని భవంతిలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈరోజు ఉదయం 9 గంటలకి లాంఛనంగా పూజాకార్యక్రమాలను జనసేన నాయకులు నిర్వహించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీకి సంబంధించిన పాలన వ్యవహారాల్ని ఈ ప్రాంగణం నుంచే నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్ర శేఖర్, పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, సేవాదళ్ ఇంచార్జి రియాజ్, పార్టీ ముఖ్యులు పాల్గొన్నట్లు తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm