హైదరాబాద్: రమణదీక్షితులు ఆరోపణలపై జేఈవో శ్రీనివాసరాజు వివరణ ఇచ్చారు. భక్తులకు వివరణ ఇవ్వవలసిన బాధ్యత నాపై ఉంది. 2001లో ప్రసాదం పోటులో మరమ్మతుల కారణంగా.. ఆలయంలోనే షెడ్లు ఏర్పాటు చేసి ప్రసాదాలు తయారు చేశాం. 2017లో కూడా ఆగమపండితులు, జియ్యంగార్లు సూచన మేరకు, ప్రసాదం పోటులో ప్రసాదాలు తయారు చేశాం. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎలా తప్పవుతుంది?. రమణ దీక్షితులు ఒక్కరే కాదు.. ఐదుగురు ఆగమ సలహాదారులున్నారు. రమణ దీక్షితులు ఒప్పుకోకపోవడంతో పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. పోటులో రమణ దీక్షితులు అంగీకరించిన పనులే చేశాం. ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి?. శ్రీనివాసరాజు వకుళామాత పోటులో ఓ పిల్లర్ కూలిపోయే స్థితిలో వుందని శ్రీనివాసరాజు వివరణ ఇచ్చారు.పూజా కైంకర్యాల నిర్వహణలో అధికారుల ప్రమేయం వుండదని, తోమాల సేవ సమయంలో అధికారులు ఎవరూ వుండరని, అలాంటిది త్వరగా చెయ్యమని ఎవరు ఆదేశిస్తారని జేఈవో శ్రీనివాసరాజు అన్నారు. ప్రతి సంవత్సరం ఆభరణాల తనిఖీలు జరుగుతాయని, రమణ దీక్షితులు రోజుకో ఆరోపణ చేయడం సరికాదని శ్రీనివాసరాజు హితవుపలికారు.
Mon Jan 19, 2015 06:51 pm