సమ్మోహనం మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ గురించి లేటెస్ట్న్యూస్. మహేష్బాబు నటిస్తున్న 25వ మూవీలో ఓ రోల్ కోసం అదితిరావ్ హైదరిని ఎంపిక చేసినట్టు ఫిల్మ్నగర్ సమాచారం. ఆ ప్రాజెక్టులో పూజహెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా, ఇప్పుడు అదితిని కూడా తీసుకోవడంతో ఆమె రోలేంటి? గ్లామర్ తరహా రోల్ వుంటుందా? లేదా? అన్నది బిగ్ క్వొశ్చన్.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదేకాదు.. కొంతమంది స్టార్ హీరోలు ఈమెని తమ కొత్త ప్రాజెక్టుల్లోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న మల్టీస్టారర్లో కూడా నటిస్తోంది. హైదరాబాద్కి చెందిన అదితి, దశాబ్దం కిందటే గ్లామర్ ఇండస్ర్టీలోకి వచ్చినా టాలీవుడ్లో సినిమాలే చేయలేదు.. బాలీవుడ్కే పరిమితమైంది. మధ్యలో మలయాళం, తమిళం, మరాఠీ చిత్రాల్లో నటించింది. ఐతే, అదితి నటించిన సమ్మోహనం చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఈమెపై పడింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 22,2018 07:44PM