వరంగల్: కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 2018-19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం మే 29 నుంచి జూన్ 5 వరకు నిర్వహించిన కేయూ పీజీ సెట్-2018 ప్రవేశ పరీక్ష ఫలితాలను కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.ఆర్.సాయన్న, రిజిస్ట్రార్ ప్రొ.కె.పురుషోత్తం ఇవాళ విడుదల చేశారు. 28 కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేయూ పీజీ సెట్-2018 ప్రవేశ పరీక్షకు 28,354 మంది దరఖాస్తు చేయగా ప్రవేశ పరీక్షలకు 24,723 మంది హాజరయ్యారు. కాగా, 21,487 మంది (88.5 శాతం) అర్హత సాధించారు.
28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన..
పీజీ సెట్ ద్వారా కేయూ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 28వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నట్లు కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొ.కె.మనోహర్, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ టి. రాజకొమురయ్య, డాక్టర్ పి.శ్రీనివాసరావు ప్రకటించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం కేయూలో రెండు కేంద్రాలు కామర్స్ బిజినెస్ కళాశాల, హ్యుమనిటీస్ విభాగంలో, కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో, ఖమ్మంలో పీజీ సెంటర్లలో అన్ని సబ్జెక్టులకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 22,2018 07:50PM