కశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారంటూ ఓ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చేలా ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి, జమ్ముకశ్మీర్కు చెందిన కాంగ్రెస్ నేత సైఫుద్దీన్ సోజ్ తాజాగా మాట్లాడుతూ... కశ్మీరీ ప్రజలు పాకిస్థాన్తో కలవాలని అనుకోవట్లేదని, అయితే, స్వాతంత్ర్యం కావాలనుకుంటున్నారని పాక్ మాజీ ప్రధాని ముషారఫ్ అన్నారని చెప్పారు. ముషారఫ్ వ్యాఖ్యలు నిజమని, తాను కూడా అదే చెబుతున్నానని, కానీ అది సాధ్యం కాదని కూడా తనకు తెలుసని వ్యాఖ్యానించారు.
సోజ్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి.. ఆయన పాకిస్థాన్కు వెళ్లిపోవాలని అన్నారు. 1991లో జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్కు చెందిన ఉగ్రవాదులు సోజ్ కూతురును కిడ్నాప్ చేశారని అన్నారు. భారత్లో ఉండాలనుకునే వాళ్లు రాజ్యాంగ బద్ధంగా ఉండాలని హితవు పలికారు. సోజ్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 22,2018 09:32PM