నారాయణపేట: బ్యాంక్ నుంచి నగదును డ్రా చేసుకొని ఇంటికి వెళ్తున్న ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడి చేతిలోంచి రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగును వెనుక నుంచి బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు సినీ ఫక్కీలో ఎత్తుకెళ్లిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న మంగళి బాలప్ప అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇటీవల వైద్య చికిత్సల కోసం చేసిన అప్పును తీర్చేందుకుగానూ పట్టణంలోని ఓల్డ్ ఎస్బీహెచ్ నుంచి నగదును డ్రా చేసుకొని బ్యాంక్ నుంచి కూత వేటు దూరానికి వెళ్లాడో లేదో పక్క నుంచి నల్ల రంగు పల్సర్ బైక్పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆయన చేతిలో ఉన్న నగదు బ్యాగును క్షణాల్లో లాక్కెళ్లారు. వెంటనే తేరుకొని పోలీస్స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి, ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 22,2018 09:51PM