గుంటూరు: జిల్లాలోని వినుకొండలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వినుకొండ పట్టణానికి చెందిన షహనాజ్, కరీముల్లా అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే... వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. పెళ్లి విషయంపై పెద్దల సమక్షంలో చర్చలు జరిగినా అవి విఫలమవడంతో షహనాజ్ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది తెలిసిన ప్రియుడు కరీముల్లా కూడా పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm