యాదాద్రి భువనగిరి: జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మూసీ నది కాలువలో ట్రాక్టర్ బోల్తా పడ్డ సంఘటనలో ఏడుగురు మృతిచెందగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. వేములకొండ గ్రామానికి సమీపంలోగల మూసీ కాలువపై వెళ్తోన్న ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న వారిలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా మరికొందరు గాయపడ్డారు. వ్యవసాయ కూలీలు కూలీ పనులు నిర్వహించేందుకు ట్రాక్టర్లో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా... మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం. ఈ ప్రమాదానికి సంభందించిన మృతుల వివరాలు, పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm