నల్గొండ: వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురం వద్ద ఉన్న మూసీ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి.. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. తన మిగితా పర్యటనలను రద్దు చేసుకొని హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరారు.
Mon Jan 19, 2015 06:51 pm