భోపాల్: కప్పలకు పెళ్లిచేస్తే దేవేంద్రుడి కరుణించి కుండపోత వర్షాలు కరిపిస్తాడనే నమ్మకం ఇప్పటికీ కొన్నిచోట్ల కనిపిస్తోంది. ఇదే నమ్మకంతో మధ్యప్రదేశ్కు చెందిన శిశు, మహిళా శాఖ సహాయ మంత్రి లలితా యాదవ్ ఛత్తర్పూర్లోని ఓ ఆలయంలో రెండు కప్పలకు దగ్గరుండి మరీ ఘనంగా పెళ్లి చేశారు. ఈ వింత పెళ్లి చూసేందుకు ఆలయానికి వచ్చిన అతిథులందరికీ ఆమె విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ పెళ్లి తంతుపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.
Mon Jan 19, 2015 06:51 pm