కరీంనగర్: అమెరికాలోనో మరో పశ్చిమ దేశంలోనో టోర్నోడో వచ్చిందనే వార్తలు చూస్తూనే ఉంటాం. అదే టోర్నోడో మన దగ్గర వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా కరీంనగర్లో ఇదే జరిగింది. కరీంనగర్ జిల్లా మనేరు డ్యామ్ వద్ద మళ్లీ టోర్నోడో తరహా దృశ్యం స్థానికులను అబ్బురపరిచింది. డ్యామ్ నుంచి 200 మీటర్లు ఎత్తు వరకు నీరు ఎగసిపడింది. టోర్నోడో తరహా దృశ్యాన్ని స్థానికులు తమ సెల్ఫోన్లలో బంధించారు. సోషల్మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. రెండేళ్ల క్రితం కరీంనగర్లో ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఇప్పడు మళ్లీ అదే పునరావృతమైంది.
Mon Jan 19, 2015 06:51 pm