జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ముక్తీశ్వరాలయం సన్నిధిలో ఆదివారం ముక్తివనం పార్కును మంత్రి ఈటల రాజేందర్, జోగురామన్న ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్నమాట్లాడుతూౌ ఈ పార్క్ ను 50 ఎకరాల్లో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిచామన్నారు. అందమైన మొక్కలతో సుందరమైన వనంగా ముక్తివనాన్ని తీర్చిదిద్దినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ముక్తేశ్వర ఆలయ సన్నిధిలో ముక్తివనం ఏర్పాటు చేసి, ప్రజలకు ఆహ్లాదాన్నిపంచడానికి ముక్తివనం ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అందరు బాధ్యతగా వ్యవహరించి అడవులను కాపాడాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో పార్కుల నిర్మిస్తామని జోగురామన్న పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm