న్యూఢిల్లీ: టీం ఇండియా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ చేసుకున్న కోహ్లీ సేన.. అక్కడ కసరత్తు చేస్తోంది. ఈ సిరీస్ కోసం టీం ఇండియా జట్టు 81 రోజుల పాటు యూనైటెడ్ కింగ్డమ్లో ఉండనుంది. అయితే ఈ పర్యటనకు వెళ్తున్న సమయంలో తాను తీసిన ఓ సరదా వీడియోని భారత ఓపెనర్ శిఖర్ ధవన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ధవన్ ఓ హిందీ పాట పాడుతూ.. టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీని రామ్ అని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని లకన్(లక్ష్మణుడు) అని పిలిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm