హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో దానం, ఆయన అనుచరులకు సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలకు ఆకర్షితుడనై టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు దానం ప్రకటించిన విషయం తెలిసిందే. బడుగు, బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్ కు మళ్లీ పునర్వైభవం వస్తుందని ఆయన అభిప్రాయపడటం విదితమే.
Mon Jan 19, 2015 06:51 pm