హైదరాబాద్: బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చింది కాంగ్రెస్సేనని ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజకీయ జన్మినిచ్చిన కాంగ్రెస్ను దానం నాగేందర్ విమర్శించడం సరికాదని హితవుపలికారు. బీసీ నేతలమంతా కాంగ్రెస్లో సంతోషంగా ఉన్నామని, గతంలో దానంను భూ కబ్జాదారుడని హోంమంత్రి నాయిని విమర్శించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భూ కబ్జాదారుడుని టీఆర్ఎస్లో ఎందుకు చేర్చుకుంటున్నారో... సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm