శ్రీనగర్: లష్కరే తొయబా ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కుల్గాంలో ఆదివారంనాడు జరిగిన ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను కాల్చిచంపగా, వీరిలో ఒకరిని లష్కరే తొయిబా కమాండర్ షకూర్గా గుర్తించినట్టు తెలుస్తోంది. 2015 నుంచి కశ్మీర్లో చురుకుగా పనిచేస్తున్న షకూర్ రాష్ట్రంలో పలు ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు ఉన్నతాధికార వర్గాల సమాచారం. షకూర్ను మట్టుబెట్టడం ద్వారా లష్కరేకు కీలకదెబ్బ తగిలినట్టు చెబుతున్నారు. కుల్గాం ఎన్కౌంటర్లోనే లష్కరేకు చెందిన మూడో ఉగ్రవాది ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా లొంగిపోయాడు.
Mon Jan 19, 2015 06:51 pm