ప్రేమించిందని గొలుసుతో కట్టేశారు రాయ్బరేలి: ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలిలో ఓ వ్యక్తిని ప్రేమిస్తుందన్న కారణంతో యువతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రియుడిని మర్చిపోయేందుకు నిరాకరించడంతో 17 ఏళ్ల అమ్మాయిని గొలుసుతో బంధించారు. భోజనం, మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించారు. ప్రియుడి సహాయంతో కుటుంబసభ్యుల చెర నుంచి తప్పించుకున్న ఆ యువతి కాలికి గొలుసుతోనే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm