తనపై అలిగి వెళ్లిపోయిన భార్య ఎంత వెతికినా కలిపించలేదన్న మనస్తాపంతో డిటొనేటర్ తో తనను తాను పేల్చేసుకున్నాడో భర్త. ఈ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడి గోవర్థన్ విలాస్ ప్రాంతానికి చెందిన వినోద్ మీనా (30) హేమలత భార్యాభర్తలు. వినోద్ గనుల్లో రాళ్లు కొట్టే పని చేస్తుంటాడు. 6 రోజుల క్రితం భర్తతో గొడవపడిన హేమలత, ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక, తనకు తెలిసిన చోటెల్లా గాలించాడు వినోద్. ఫలితం లభించకపోవడంతో, మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తాను పనిచేసే ప్రాంతం నుంచి ఓ డిటోనేటర్ ను తీసుకువచ్చాడు. దాన్ని పొట్టకు కట్టకుని, నిప్పంటించుకుని వీధుల్లోకి పరిగెత్తాడు. అది పేలడంతో వినోద్ శరీరం తునాతునకలైంది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. వినోద్ తన పొట్టకు డిటొనేటర్ కట్టుకోడవం స్పష్టంగా కనిపించిందని చెప్పిన పోలీసులు, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm