హైదరాబాద్: శేరిలింగంపల్లి హూడా ట్రేడ్ సెంటర్లో ఘర్షణ జరిగింది. ఇంటర్ విద్యార్థి అజయ్బాబును మరో విద్యార్థి సంపత్ కత్తితో పొడిచాడు. నిన్న అర్థరాత్రి ఇద్దరు విద్యార్థుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. కత్తిపోట్లకు గురైన అజయ్బాబును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. ఇద్దరు బాలురు చందానగర్ హూడా కాలనీ వాసులుగా గుర్తించారు. ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ను అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm