ఆత్మకూరు(ఎం)(యాదాద్రి భువనగిరి): గ్రామస్థాయి నుంచి కాంగ్రె్స పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్తల కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ కోరారు. మండలంలోని పారుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడా రు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రా ష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుంపటిగా మార్చారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పూటకో మాట, రోజుకో హామీతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బూడిద రాములు, నర్సయ్య, మల్లారెడ్డి, కొమురెల్లి, శ్రీహరి, మహిపాల్రెడ్డి, శివయ్య, మహేష్, సోమనర్సయ్య, యాదయ్య, అశోక్, దేవేందర్, నరేష్, సోమరాజు, ప్రణయ్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm