హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజ్ కేసులో నిందితులను వరుసగా నాలుగో రోజు సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. నిందితులు వాసుబాబు, శివ నారాయణలను ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు. బ్రోకర్లతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. బ్రోకర్లను పలిచి ఈరోజు మరోసారి సీఐడీ విచారించనుంది. ఈ కేసులో భాగంగా శనివారం నిందితులను సీఐడీ కటక్ తరలించిన విషయం తెలిసిందే. ఎంసెట్ లీకేజ్ కేసులో పరారీలో ఉన్న 15 మంది పాత్రపై సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.
కార్పోరేట్ కళాశాల పూర్వ విద్యార్ధులతో నిందితులు ఎందుకు టచ్లో ఉన్నారో ఆరా తీస్తున్నారు. లీకైన ప్రశ్నాపత్రం ద్వారా ర్యాంక్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సీఐబీ విచారిస్తోంది. ఎంసెట్ పేపర్ లీకేజ్ వెనకాల కీలక సూత్రదారులపై సీఐడీ ప్రధానంగా దృష్టి సారించింది. మరోవైపు ఈ స్కామ్లో అరెస్ట్ అయిన గణేష్ ప్రసాద్ కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరుగనుంది. గణేష్ ప్రసాద్ను సీఐడీ వారం రోజు పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 16,2018 12:14PM