విజయవాడ : టిడిపి ఎంఎల్ఎ బోడె ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి ఎంఎల్ఎ రోజాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు ఆదు శ్రీహరిరాణి కంకిపాడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక టిడిపి మండల కార్యాలయం నుంచి ర్యాలీగా తెలుగు మహిళలు కంకిపాడు పోలీసు స్టేషన్కు తరలివెళ్లారు. ఈ క్రమంలో వారు రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాదు శ్రీహరిరాణి మాట్లాడారు. స్థానిక ఎంఎల్ఎ బోడె ప్రసాద్ మహిళలకు సముచిత స్థానం కల్పించారని ఆమె పేర్కొన్నారు. ఆయన మహిళలకు ఎంతో గౌరవం ఇస్తారని చెప్పారు. ఇటువంటి ఎంఎల్ఎలపై రోజా ఆరోపణలు , అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. బోడె ప్రసాద్కు రోజా తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm