ముంబై : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాలు అతలాకుతలమైన విషయం విదితమే. ఈ క్రమంలో రహదారులపై గుంతలు ఏర్పడటంతో.. పలువురు వాహనదారులు, పాదాచారులు మృతి చెందారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవీ ముంబైలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పీడబ్ల్యూడీ) కార్యాలయాన్ని ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఇవాళ ధ్వంసం చేశారు. అక్కడున్న కంప్యూటర్లు, ఫర్నీచర్ను పగులగొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎంఎన్ఎస్ కార్యకర్తలు.
Mon Jan 19, 2015 06:51 pm