వెంకటాపురం (నూగూరు): పొయ్యిల కట్టెల కోసం వెళ్లి ఇద్దరు వ్యవసాయ కూలీలు ప్రమాదవశాత్తు కామిని చెరువులో మునిగి మృతిచెందిన విషాదకర సంఘటన ఇది. జయశంకర్ జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం సూరవీడు గ్రామానికి చెందిన బొగట ఆదినారాయణ(45), కొండాపురం(కె) గ్రామానికి చెందిన మడకం జోగయ్య(55) అదే గ్రామానికి చెందిన కొర్సా మారయ్యతో కలిసి రెండు ఎడ్లబండ్లతో సూరవీడు శివారులోని కామినిచెరువు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చెరువు దాటే క్రమంలో ఆదినారాయణ, జోగయ్య ఎడ్లను శుభ్రం చేసేందుకు చెరువులోకి ఎడ్లబండిని తీసుకువెళ్లారు. ఈక్రమంలో బెదిరిన ఎడ్లు లోతులోకి వెళ్లి పోయాయి. దీంతో బండిపైన ఉన్న ఆదినారాయణను కాపాడేందుకు ఈదుకుంటూ వెళ్లిన జోగయ్య నీటిలో గల్లంతయ్యాడు. ఇది గమనించిన కొర్సా మారయ్య వెళ్లి ఎడ్లను విడిపించాడు. అనంతరం తాడుకోసమని గ్రామంలోకి వెళ్లాడు. బండిపైన ఒంటరిగా ఉన్న ఆదినారాయణ చెరువులోకి దిగి ఒడ్డుకు వచ్చే ప్రయత్నంలో మునిగిపోయాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 16,2018 01:32PM