సొరోంగ్, ఇండోనేషియా: ఓ స్థానిక మనిషిని ఓ మొసలి చంపిందని ఆగ్రహించిన ఆ ఊరి జనం.. ప్రతీకారంతో రగిలిపోయారు. ఏకంగా 300 మొసళ్లను మట్టుబెట్టారు. శనివారం ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది. సుగితో అనే ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మొసలి ఉన్న ఎన్క్లోజర్లోకి పడిపోగా.. అది అతన్ని చంపేసింది. అదే రోజు అతని అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్థులు.. మొసళ్ల ఎన్క్లోజర్ను ఇళ్ల మధ్య పెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడానికి సదరు ఎన్క్లోజర్ సిబ్బంది అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.
అయినా గ్రామస్థులు మాత్రం వినలేదు. వందల సంఖ్యలో ఉన్న స్థానికులు కత్తులు కటార్లతో మొసళ్లు ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడున్న మొత్తం 292 మొసళ్లను చంపేశారు. అందులో నాలుగు అంగుళాల పొడవున్న చిన్నచిన్న పిల్లల నుంచి రెండు మీటర్ల పొడవున్న పెద్ద మొసళ్లు కూడా ఉన్నాయి. ఈ దాడిని తాము అడ్డుకోలేకపోయామని పోలీసులు చెప్పారు. ఇండోనేషియాలో వివిధ రకాల మొసలి జాతులు ఉన్నాయి. ఇవి తరచూ మనుషులపై దాడి చేసి చంపుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఇలాగే ఆరు మీటర్ల పొడవున్న మొసలిని అధికారులే కాల్చి చంపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 16,2018 01:42PM