ఆదిలాబాద్, తాంసి: తాంసి మండలంలోని హ స్నాపూర్ గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తోంది. గత పది రోజులు క్రితం నుంచి పిచ్చి కుక్క ఇప్పటి వరకు ఐదుగురిపై దాడి చేసింది. ఇందులో గ్రామానికి చెందిన గోక పుష్పలత(48) మృతి చెందింది. మరో నలుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చి కిత్స పొందుతున్నారు. పుష్పలత ఈ నెల 4న పొలం నుంచి ఇంటికి వస్తున్న తరుణంలో ఆమెకు పిచ్చి కుక్క కరిచింది. వెంటనే ఆమెను జిల్లా కేం ద్రంలోని రిమ్స్కు తరలించారు. అక్కడ ఆమెకు వైద్యు లు కుక్క కాటుకు సంబంధించిన వైద్య చికిత్సలు అందించారు. గత ఐదు రోజుల క్రితం ఆమె డిచ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. అయితే కుక్క కరిచిన భాగంలో నొప్పిగా ఉండడంతో ఆమె హైదరాబాద్కు తరలించారు. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపా రు. మృతిరాలికి భర్త లింగారెడ్డి, కొడుకు విష్ణు, కుమార్తె పూర్ణిమలు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm