హైదరాబాద్ : సెల్ ఫోన్ కోసం ఓ యువకుడు తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. ఉప్పల్కు చెందిన ఇంటర్ విద్యార్థి సాగర్ లాంగ్ డ్రైవ్ పేరుతో తన స్నేహితుడు ప్రేమ్ను ఆదిభట్లకు తీసుకెళ్లాడు. అక్కడ ప్రేమ్ను దారుణంగా చంపి కాల్చివేశాడు. సెల్ఫోన్ కోసమే తన స్నేహితుడు ప్రేమ్ను హత్య చేసినట్టు సాగర్ పోలీసుల విచారణలో తెలిపినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm