తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు సోమవారం దాడికి పాల్పడ్డారు. సిటీ సెంటర్లోని గవర్న్మెంట్ ప్రెస్ సమీపంలో శశిథరూర్ కార్యాలయం ఉంది. సుమారు 15 మంది కార్యకర్తలు ఆయన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. కార్యాలయం ముందు నల్ల ఇంకు పూశారు. శశిథరూర్కు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు తెలిపారు.
బీజేపీ 2019లో మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఆ పార్టీ తిరగ రాస్తుందని, సొంత చట్టాలు తెస్తుందని, అదే జరిగితే దేశం ఃహిందూ పాకిస్థాన్ఃగా మారుతుందని శశిథరూర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. ఈ నేపథ్యంలో శశిథరూర్ కార్యాలయంపై దాడికి పాల్పడిన నిరసనకారులు శశిథరూర్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని, వెంటనే ఆయన దేశం విడిచి వెళ్లిపోయాలని డిమాండ్ చేశారు. కాగా, దాడి సమయంలో శశిథరూర్ తన కార్యాలయంలో లేరు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 16,2018 05:10PM