హైదరాబాద్ : వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం 'ఆర్ఎక్స్ 100'. కార్తీకేయ, పాయల్ రాజ్పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిట్ టాక్తో ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రం విడుదలైన నాలుగురోజుల్లోనే మంచి వసూళ్లను రాబడుతోంది. 4 రోజుల్లో ఆర్ఎక్స్ 100 రూ.5 కోట్లకు పైగా షేర్ను వసూలు చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఈ చిత్రం రూ. 5,18,04,822 షేర్ రాబట్టినట్లు సమాచారం. ఈ మూవీలో రావు రమేశ్, రాంకీ కీలక పాత్రల్లో నటించారు. నైజాంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆర్ఎక్స్ 100 కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm